గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (16:18 IST)

కేసీఆర్ ఫ్యామిలీకి పదవులే ముఖ్యం : పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు, ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, అధికారమే ముఖ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో చేరేందుకు కేసీఆర్ కుమార్తె తహతహలాడుతున్నారన్నారు. 
 
అందుకే, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగినా... కేంద్రాన్ని కేసీఆర్ పల్లెత్తు మాట కూడా అనలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రత్యేక హైకోర్టు కావాలని న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా... కేసీఆర్‌కు చెవికెక్కడం లేదని పొన్నం వాపోయారు. 
 
ఈ విషయంలో బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని న్యాయవాదులు హెచ్చరించాలని... అప్పుడు రెండు పార్టీలు కూడా దిగొస్తాయని అన్నారు.