శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (14:14 IST)

మెట్రో రైలుకు కేసీఆర్ గ్రహణం... టీ.సీఎంపై రేవంత్ మండిపాటు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు  ఇద్దరూ మెట్రో రైలు ప్రాజెక్టును ఉపసంహరించుకునే నిర్ణయానికి కారణం కాదా అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి నిలదీశారు. బుధవారంనాడు మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ దొరతనమే మెట్రో రైలు హైదరాబాద్ నుంచి ఉపసంహరించుకోవడానికి కారణమంటూ దుయ్యబట్టారు.
 
హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రణహంగా మారిందని మండిపడ్డారు. డిజైన్ విషయంలో ఎల్అండ్టీని ఒప్పించలేకపోవడం వల్ల మెట్రో పనులు కొనసాగించలేమని ఎల్అండ్టీ లేఖ రాసిందని ఆయన అన్నారు. మెట్రో ప్రాజెక్టు సజావుగా సాగించేందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చారు.