శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 2 అక్టోబరు 2014 (18:41 IST)

బతుకమ్మ పండుగ వేడుక... వేదికపైకి కెసిఆర్, గవర్నర్ దంపతులు

హైదరాబాదులో గురువారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం లాల్ బహదూర్ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు  ప్రారంభమైంది. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈ ఊరేగింపులో బతుకమ్మలను నెత్తిపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.
 
ట్యాంక్‌బండ్ ఏర్పాటైన ప్రధాన వేదికపైకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన సతీమణి శోభతో చేరుకున్నారు. అలాగే గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా సంప్రదాయ దుస్తుల్లో వేదిక వద్దకు చేరుకున్నారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.