బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 24 జులై 2014 (14:34 IST)

కాకతీయ స్కూలు బస్సును నడిపింది.. ఓ ట్రాక్టర్ డ్రైవర్!

తెలంగాణలో విషాదానికి కారణమైన ఘటనలో మరో కీలక అంశం వెలుగుచూసింది. కాకతీయ విద్యామందిర్ స్కూలు బస్సును ప్రమాద సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బస్సును నడిపే రెగ్యులర్ డ్రైవర్ గైర్హాజరు కావడంతో స్కూలు యాజమాన్యం భిక్షపతి అనే ట్రాక్టర్ డ్రైవర్‌కు బస్సు అప్పగించినట్టు సమాచారం. 
 
ఆ సమయంలో రైలు రాదన్న నమ్మకంతోనే అతడు బస్సును పట్టాలు దాటించే యత్నం చేయగా, అదే సమయంలో వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు మృత్యువాత పడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న 38 మందిలో కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.