మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (09:07 IST)

మత్తు ఇంజెక్షన్ వేసుకుని స్టాఫ్‌నర్స్ ఆత్మహత్య.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగేళ్లుగా పని చేస్తున్న ఓ స్టాఫ్ నర్సు బలవన్మరణానికి పాల్పడింది. తాను పని చేసే ఆస్పత్రి నుంచి తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డ గ్రామానికి చెందిన సౌందర్య (25) సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూ ఆస్పత్రి హాస్టల్‌లోనే నివసిస్తోంది. 
 
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని హాస్టల్‌కు వచ్చిన సౌందర్య రాత్రయినా బయటకు రాకపోవడంతో స్నేహితులు అనుమానించారు. దీంతో గదిలోకి చూడగా విగతజీవిగా కనిపించింది. 
 
ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి గదిని పరిశీలించారు. ఆమె పక్కన మత్తు ఇంజక్షన్ పడి ఉండడంతో అది తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.