శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (10:52 IST)

ఏకే-47తో కాల్పులు : కేబీఆర్ పార్కు వద్ద బందోబస్తు!

అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానంద రెడ్డిపై బుధవారం ఓ ఆగంతకుడు ఏకే-47తో కాల్పులు జరపడంతో గురువారం నుంచి హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు (కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు) వద్ద గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. 
 
దీనిపై ఈ పార్కులోకి మార్నింగ్ వాక్‌కు వచ్చే సినీ నటుడు చలపతి రావు మాట్లాడుతూ... గత 15 ఏళ్లుగా తాను కూడా ఇక్కడకు వాకింగ్ కోసం వస్తున్నానని... ఏనాడూ సరైన సెక్యూరిటీ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఎంతో మంది వీవీఐపీలు ఇక్కడకు వస్తుంటారని... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకింగ్ చేస్తుంటారని... మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రోజూ వస్తారని చెప్పారు. 
 
ఇప్పటి దాకా ఎలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి సెక్యూరిటీ పెట్టలేదని... ఇప్పుడు కాల్పులు జరిగాయి కాబట్టి వెంటనే సెక్యూరిటీ అరేంజ్ చేశారని అన్నారు. ఇంతమంది వీఐపీలు వాకింగ్ చేసే చోట సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్క్ వద్ద సెక్యూరిటీని ఎప్పటికీ కొనసాగించాలని సూచించారు.