బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (19:30 IST)

కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది.. ఆయన్నే మార్చేయాలి : షబ్బీర్ అలీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని, అందువల్ల ఆయన్నే మార్చేయాలని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు రోజుకో కొత్త విధానం తాజాగా ఆయన కన్ను సెక్రెటేరియట్‌ మీదపై పడిందన్నారు. 
 
తెలంగాణ ఏమైనా కేసీఆర్‌ సొంత జాగీరా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి పట్టిందని, పదవి నుంచి ఆయన్నే తొలగిస్తే వాస్తు బాగుంటుందని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రం కోసం మొక్కిన మొక్కులు చెల్లించేందుకే ఎనిమిది నెలలు పడితే, ప్రజలకు ఇచ్చిన లెక్కలేనన్ని హామీలు నెరవేర్చేందుకు ఎంత కాలం కావాలని ప్రశ్నించారు. ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రిని తరలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 
 
ఫాస్ట్ పథకం అంటూ ఇంతకాలం తెలంగాణలోని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుని, ఇప్పుడు వాస్తు పేరిట తెలంగాణ ఖజానా ఖాళీ చేస్తావా? అని ఆయన నిలదీశారు. ఇంతకాలం సచివాలయంలో పాలన జరగలేదా?, పదేళ్లు ఆగితే ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఖాళీ కాదా? అని ఆయన ప్రశ్నించారు.