బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (09:51 IST)

శాశ్వతనిద్రలోకి జారుకున్న పౌర హక్కుల నేత ఎంటీ ఖాన్!

పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్‌గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. 
 
స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ఎంటి ఖాన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఖాన్ యువకుడిగా ఉన్నప్పుడు రాజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కొంతకాలం కోట్ల అలిజా ధర్మవంత్ విద్యా సంస్థలో పాఠాలు కూడా బోధించారు. ఆ తర్వాత సియాసత్, ఈనాడు గ్రూప్‌నకు చెందిన న్యూస్ టైమ్ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఎంటీ ఖాన్ మృతిపట్ల పౌర హక్కుల నేతలు, గద్దర్, కోదండరాం వంటి నేతలు సంతాపం వ్యక్తం చేశారు.