శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (13:07 IST)

కేసీఆర్ చేస్తున్న తప్పులే మాకు వరాలు : గీతారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేస్తున్న తప్పులే తమకు వరాలుగా మారుతాయని టీ కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి జె గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆమె గురువారం మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఇదే తమకు లాభిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. మెదక్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, వీరిలో ఒకరి పేరును రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఆసక్తి ప్రదర్శిస్తున్న అందరి పేర్లూ ఆధిష్టానానికి పంపుతామని, రెండు మూడు రోజుల్లో అధికారికంగా పార్టీ అభ్యర్థి పేరు వెల్లడిస్తుందని గీతారెడ్డి తెలిపారు. అభ్యర్థి ఎవరైనా సమష్టిగా పని చేస్తామని ఆమె స్పష్టం చేశారు.