శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (09:58 IST)

మోడీకి కేసీఆర్ లేఖ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభలలో సీట్ల సంఖ్య పెంచి, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా.. చట్టసభల్లో ఓబిసిలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఓబిసిల అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి తీర్మానం చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.