శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (13:50 IST)

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి వైద్య పరీక్షలు!

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంగళవారం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఒంట్లో నలతగా ఉండటంతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. 
 
నిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిమ్స్ వైద్యులు డాక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో మహమూద్ అలీ ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. కాగా, పరీక్షల అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకుని నిమ్స్‌‌లో చికిత్స పొందుతున్న సినీనటుడు కృష్ణంరాజును మహమూద్ అలీ పరామర్శించారు.