గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (19:16 IST)

పెన్ గంగా నదిపై బ్యారేజీకి రూ.500 కోట్లు: అమరవీరులకు రూ. 13.20కోట్లు!

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అకోలి వద్ద పెన్ గంగా నదిపై తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీని నిర్మించబోతోంది. బ్యారేజీ సర్వే పనులను రాష్ట్ర మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్, తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ. 500 కోట్లతో బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే, 20 వేల హెక్టార్లకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
 
అలాగే 132 అమరవీరుల కుటుంబాలకు రూ.. 10లక్షల వంతున రూ. 13.20 కోట్లను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ఎంత చేసినా రుణం తీరదని... తెలంగాణ రియల్ హీరోస్ అమరవీరులేనని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
 
సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో 132 అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున రూ. 13.20 కోట్లను ఈటెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నారన్నారు. బంగారు తెలంగాణను సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.