గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2014 (13:57 IST)

టి ఫలితాలతో పవన్ కళ్యాణ్‌కు దిమ్మతిరిగి మైండ్‌బ్లాకైంది : కవిత

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఫలితాలతో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జోస్యం చెప్పారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే దిమ్మ తిరిగిపోయిందని, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయనకు షాకిచ్చే ఫలితాలను తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నారు. 
 
ఇకపోతే.. మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేదన్నారు. ఈ ఎన్నిక్లలో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎన్ని రూపాయలు ఇచ్చి బీజేపీ టిక్కెట్ కొన్నాడో చెప్పాలన్నారు. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి దీని పైన వివరణ ఇవ్వాలని ఆమె సవాల్ విసిరారు. టీడీపీ, బీజేపీల కలయిక అనైతికమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కాదు.. తెలంగాణ ప్రభుత్వ విధానాలే మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయన్నారు.