బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (14:53 IST)

అన్నావదినల వేధింపులు.. సోదరి చేతికి ఇనుప సంకెళ్లు

అన్నావదినలు వేధిస్తున్నారని ఓ చెల్లెలు తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె మానసిక ఆరోగ్యం బాగోలేదని.. పొరుగింటి వారిపై దాడి చేయాలని చూస్తోందని.. చేతులు కట్టేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కే

అన్నావదినలు వేధిస్తున్నారని ఓ చెల్లెలు తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె మానసిక ఆరోగ్యం బాగోలేదని.. పొరుగింటి వారిపై దాడి చేయాలని చూస్తోందని.. చేతులు కట్టేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణినగర్‌కు చెందిన చిట్యాల గీత అనే యువతి తన అన్నలైన చిట్యాల నారాయణ, రమేష్‌, శ్రీనివాస్‌లతో కలిసి ఉంటోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో గీత సోదరుల వద్దే వుంటూ డిగ్రీ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసింది. 
 
అయితే ఇటీవల అన్న, వదినల వేధింపులు ఎక్కువయ్యాయని, తనతో వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ కాలనీవాసులకు మొర పెట్టుకుంది. బుధవారం ఇంట్లో నుంచి పారిపోయింది. కానీ గీతను పట్టుకున్న అన్న వదినలు చేతికి గొలుసులు వేసి చితకబాదారు. ఆ సమయంలో స్థానికులతో గీత తాను ఇంటికి వెళ్లనని.. అనాధ ఆశ్రమానికి పంపాలని వేడుకుంది. 
 
స్థానిక కౌన్సిలర్‌ గుగ్గిల్ల హరీష్‌ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి చేరదీయడంతో పాటు టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గీతకు కౌన్సిలింగ్ ఇచ్చి హైదరాబాదులోని మహిళా, శిశు సంక్షేమ కేంద్రానికి తరలించామని జగిత్యాల జిల్లా ఎస్ఐ అనంత శర్మ వెల్లడించారు. తీవ్ర ఒత్తిడికి గురైన గీతను వైద్యులు పరీక్షించారని.. అన్నా వదినల కారణంగా వేధింపులకు గురైందని.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనంత శర్మ చెప్పారు.