ఎంసెట్ కౌన్సెలింగ్కు విధులు నిర్వహించం : టీఎన్జీవో ప్రెసిడెంట్
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులను నిర్వహించబోమని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీశ్రీప్రసాద్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఎంసెట్ కౌన్సెలింగ్కు తమ ప్రాంతానికి చెందిన ఏ ఒక్క ఉద్యోగి హాజరుకారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు.
ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది.