గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: బుధవారం, 23 జులై 2014 (22:16 IST)

హైదరాబాద్ మెట్రో రైల్లో మహిళా టిసీపై దాడి

సికింద్రబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో టిటిఈ పై దాడికి పాల్పడ్డారు ప్రయాణికులు. సికింద్రబాద్ లింగంపల్లి MMTS రైళ్లో విధులు నిర్వర్తిస్తున్న కౌసల్య అనే టిటిఈ ప్రయాణికుల నుంచి టిక్కెట్లు అడుగుతున్న సమయంలో ఓ మహిళ తన వద్ద టిక్కెట్ లేదంటు సమాధానం చేప్పింది. 
 
దీంతో ఆమె వద్ద నుంచి మొబైల్ తీసుకోనే ప్రయత్నం చేయగా ఇరువురు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో గొడవ పెరిగిపోవటంతో సంజీవయ్య పార్కు నుంచి బేగంపేట రైల్వే స్టేషన్ రాగానే MMTS టిటివి వారిని రైళ్ళో నుంచి దింపి పోలీసులకు సమాచారం అందించింది. 
 
టిటిఈ ఈ గొడవలో తనపై నలుగురు వ్యక్తులు చేయిచేసుకున్నట్లు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.