శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: సోమవారం, 14 జులై 2014 (13:00 IST)

గండ్రా... నీటి బుడగలం కాదు.. ఫుట్‌బాల్ ఆడేస్తాం..

మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నీటిమీద బుడగతో పోల్చడంతో టిఆర్ఎస్ వర్గాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నీటి బుడగ కాదని.. టిఆర్ఎస్ పార్టీ మిగిలిన పార్టీలను ఫుడ్ బాల్ మాదిరిగా ఆడుకుంటుందని  తొలిసారిగా గెలిచిన యువ ఎం.పి అంటున్నారు. ఉద్యమం ఫలితంగా ఎం.పి అయిన సదరు నేత ఇప్పటికే తెలంగాణాలో తెలుగుదేశాన్ని ఖాళీ చేయించే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చారు.
 
నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీయేనని ఆఫ్ ది రికార్డ్ పాత్రికేయులతో అన్నారు. మా నాయకుడు గండ్ర చెప్పినంత అమాయకుడు కాదని తెలుసుకోవాలన్నారు. అంత తెలివైన నాయకుడు యావత్ తెలంగాణాలోనే లేడు అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగి, అపరమేథావులు, కోర్ టీం ఉన్న కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్‌ని ఏం చేయలేక పోయిందని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అపర చాణుక్యుడని సెలవిచ్చారు.
 
మరి తెలంగాణా ప్రభుత్వం నీటి బుడగలా పేలిపోతుందో... సదరు ఆ ఎం.పి చెప్పినట్లు పార్టీలను పుడ్‌బాల్ ఆడుతుందో లేదో చూడాలి...