శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (16:09 IST)

పవన్ కళ్యాణ్... ప్యాకేజీ పుచ్చుకుని మాట్లాడారు : తెరాస ఎంపీ బాల్క సుమన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెరాస ఎంపీ బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, బీజేపీ ఎంపీలను టార్గెట్ చేసిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మాత్రం పల్లెత్తు మాట అనలేదన్నారు. దీని వెనుక ప్యాకేజీ పుచ్చుకోవడమేనని ఆయన ఆరోపించారు. 
 
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రకటించిన పవన్... ఇపుడు ప్యాకేజీలు పుచ్చుకుని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పవన్ కళ్యాణ్ మీడియా ప్రసంగం ఏదో ప్యాకేజీ తీసుకుని మాట్లాడినట్టుగా ఉందన్నారు. అదేసమయంలో, టీకాంగ్రెస్ నేతలపై కూడా సుమన్ విమర్శల వర్షం కురిపించారు. 
 
తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అత్యున్నత పథంలో నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని... ఈ సమయంలో నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉందని అన్నారు. మంచి సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి చేస్తామన్నారు.