గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Modified: సోమవారం, 2 మే 2016 (21:23 IST)

ట్విస్ట్... జ‌గ‌న్ సూచ‌న‌తోనే పొంగులేటి టిఆర్ఎస్ లోకి వెళ్లారా...?!!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకే పొంగులేటి టిఆర్ఎస్ తీర్థం తీసుకుంటున్నార‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. జగన్ కేసులు బెంచ్ మీదకు వస్తున్నాయని, హైకోర్ట్ విభజన జరుగుతుందని, జగన్ కేసులు తెలంగాణ కోర్టుకు బదిలీ కాబోతున్నాయని అందుకే ఆయ‌న త‌న

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకే పొంగులేటి టిఆర్ఎస్ తీర్థం తీసుకుంటున్నార‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. జగన్ కేసులు బెంచ్ మీదకు వస్తున్నాయని, హైకోర్ట్ విభజన జరుగుతుందని, జగన్ కేసులు తెలంగాణ కోర్టుకు బదిలీ కాబోతున్నాయని అందుకే ఆయ‌న త‌న ఎత్తుగ‌డ మార్చుకుంటున్నార‌ని ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. 
 
ఫైనల్‌గా తెలంగాణా సీఎం కేసీఆర్ సహకారం జగన్ మోహన్ రెడ్డికి అవసరం కాబ‌ట్టి ... అందులో భాగమే ఈ గేమ్ ప్లాన్ అంటున్నారు. నిన్న సాయంత్రం వరకూ జగన్, పొంగులేటి ఢిల్లీలో కలిసే ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం. ప్లాన్‌లో భాగంగానే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేయబోతున్నార‌ని, దానికి నిరసనగా పొంగులేటి పార్టీని వీడబోతున్నట్లు ప్రకటించి పోతున్నారని తెలుస్తోంది.
 
తెలంగాణా నుంచి కేంద్రంలోకి క‌విత‌, పొంగులేటి?
తెలంగాణా నుంచి కేంద్రమంత్రులుగా కేసీఆర్ తనయ క‌విత‌కు ఈసారి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఆమెతో పాటు పొంగులేటి సుధాక‌ర్‌కి కూడా బెర్త్ ద‌క్కుతుంద‌ని పేర్కొంటున్నారు.