శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (07:57 IST)

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

బెల్లం పల్లె సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివారలిలా ఉన్నాయి.
 
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి కన్నాల ఫ్లైఓవర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగివున్న లారీని మరోలారీ, వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
డీసీఎం, లారీకి చెందిన ఇద్దరు డ్రైవర్లు మృతిచెందగా, లారీ క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహబూబ్ నగర్,మహారాష్ట్రకి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.