గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (14:51 IST)

కాంగ్రెస్ ఏమీ చేయలేదా? బీఫామ్‌లు అమ్ముకున్న చరిత్ర మరిచిపోయావా : డీఎస్‌పై వీహెచ్ ఫైర్

తన వల్లే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని... అయినా, ఆ పార్టీ తనకు ఏమీ చేయలేదంటూ వ్యాఖ్యానించిన ఆ పార్టీ మాజీనేత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్‌పై టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటూ లేకపోతే డీఎస్ ఎవరికైనా తెలిసేవాడా అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్‌గా పని చేసిన సమయంలో చివరకు బీఫామ్‌లు కూడా అమ్ముకున్న దరిద్రపు చరిత్ర డీఎస్‌ది అంటూ ఘాటైన విమర్శలు చేశారు. 
 
డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా దోచుకున్నాడని... దోచుకున్నది దాచుకోవడానికి ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లాడంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చానని చెప్పిన డీఎస్... ఇదే మాటను దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉండగా ఎందుకు చెప్పలేదని నిలదీశారు. డీఎస్‌తో కేసీఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలని వీహెచ్ సూచించారు.