గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (09:39 IST)

కూకట్‌పల్లి బస్టాపు వద్ద మహిళ దారుణ హత్య!.. అత్యాచారం చేశారా?

హైదరాబాద్ కూకట్‌పల్లి బస్టాండు సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య చేసిన వ్యక్తిని కూడా పోలీసు జాగిలం సాయంతో అరెస్టు చేశారు. అయితే మహిళ మృతదేహం పక్కనే కండోమ్ పడివుంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులే ఆ మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసివుంటారని స్థానికులు భావించారు. ఈ విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ... మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది. దుండగులు మహిళపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలం రాకీ సంఘటనా స్థలం నుంచి సుమారు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న కేపీహెచ్‌బీ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ముందున్న బస్టాప్‌లో ఓ వ్యక్తి వద్దకు వెళ్లి ఆగింది. 
 
పోలీసులు అతడ్ని అదుపులో తీసుకుని విచారించగా మహిళను హత్య చేసినట్టు అంగీకరించాడు. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులున్నారని చెప్పాడు. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కూకట్‌పల్లి సబ్‌డివిజన్‌ ఏసీపీ సాయి మనోహర్‌, సీఐ చంద్రకాంత్‌ తెలిపారు.