మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:18 IST)

మేనల్లుడుతో మహిళా ఎస్.ఐ రాసలీల... భర్త పట్టుకున్నాడనీ...

ఆమె కాబోయే మహిళా ఎస్.ఐ. వరసకు అల్లుడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు అడ్డంగా బుకైపోయింది. వివరాల్లోకి వెళితే రైల్వేలో పనిచేస్తున్న శ్రీనివాస్ మృతి చెందడంతో శ్రీనివాస్ భార్య సంగీతపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు శ్రీనివాస్ సోదరులు సురేష్, శంకర్. దీంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం శ్రీనివాస్ భార్య సంగీతను అదుపులోకి తీసుకుని విచారించారు నాంపల్లి రైల్వే పోలీసులు. 
 
ఈ విచారణలో ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. భర్తను తనే హత్య చేసినట్లు అంగీకరించింది సంగీత. తన అల్లుడు విజయ్ సహాయంతో చాపలో చుట్టి బోరబండ రైల్వే ట్రాక్ పక్కన పడేసినట్టు తెలియజేసింది. కేసును దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు హత్యగా తేలడంతో సంగీత అల్లుడు విజయ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బిఇడి చదివిన సంగీత ఇటీవల జరిగిన ఎస్సై పరీక్షల్లో సెలక్షన్ ఎస్సైగా క్వాలిఫై అయింది.
 
మరికొద్ది రోజుల్లో పోస్టింగ్ కూడా రావాల్సి ఉంది. శ్రీనివాస్‌కు స్వయానా అక్క కొడుకైన విజయ్ రెండు సంవత్సరాల క్రితం శ్రీనివాస్ ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ భార్య సంగీతతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్, భార్యను తీవ్రంగా మందలించి విజయ్‌ను ఇంటి నుంచి పంపించేశాడు. ఇదే విషయంపై తరచూ గొడవలు పడుతుండేవారు ఈ భార్యభర్తలు. 
 
సంగీత ప్రవర్తనతో విసుగు చెందిన శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం నాడు సాయంకాలం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో  అర్థరాత్రి భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న భార్య సంగీత సాయంకాలం ఆరు గంటల సమయంలో ప్రియుడు విజయ్‌కి ఫోన్ చేసి పిలిపించింది.

రాత్రి పదకొండున్నర సమయంలో రైల్వే క్వార్టర్ వెనుక నుండి ఇంట్లోకి ప్రవేశించాడు విజయ్ శ్రీనివాస్ మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో భార్య సంగీత సహాయంతో శ్రీనివాస్ తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు శ్రీనివాస్. కాబోయే పోలీస్ అధికారిణి ఇటువంటి కేసులో ఇరుక్కోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.