గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (10:50 IST)

టీఆర్ఎస్‌లోకి క్యూ కట్టిన కాంగ్రెస్ - వైకాపా ఎమ్మెల్యేలు!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే మదన్ లాల్‌తో పాటు ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, వెంకట్రావు, రాజేశ్వర రావులు కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరనున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ పటిష్టతపై దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న విషయం తెల్సిందే. ఈ గాలంలో చిక్కున్న పలువురు ప్రజాప్రతినిధులు సొంత పార్టీలకు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. ఈ కోవనే ఇపుడు వైకాపా, వైఎస్ఆర్ సీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెరాసలోకి చేరుతున్నారు.