ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా 'తెరంగేట్రం' చేస్తున్నాడు. తన డాడీ నటిస్తున్న 'నేనొక్కడినే' మూవీలో ఈ కుర్రాడు ఇదివరకే కొన్ని సీన్స్లో నటించాడు. ప్రస్తుతం మహేష్, గౌతమ్లు గోవాలో ఉన్నారు. దర్శకుడు సుకుమార్ అధ్వర్యంలో వీరిద్దరూ షూటింగ్లో పాల్గొంటున్నారు. అలా అని ఇద్దరూ కలిసి స్క్రీన్పై కనిపిస్తారనుకుంటే పొరపాటే. ఇద్దరిపై వేర్వేరుగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.