కొబ్బరి బొండాం, రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని మనీషా ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించి హంగామా, సామాన్యుడు, గుండమ్మగారి మనవడు, కిక్ వంటి చిత్రాలను ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్పై సమర్పించిన నిర్మాత కె.అచ్చిరెడ్డి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి జూలైలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.విజయభాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.