గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:23 IST)

వెయ్యి మందితో వర్మ 'ఎటాక్' ప్రారంభం...!

ప్రముఖ సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన అనుకుంటే ఎంతటి అంత్యంత భారీ బడ్జెట్‌తో అయినా సినిమాల చేయగలరు. అదే సమయంలో అతి తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి విజయం సాధించగల సమర్ధులు. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు అత్యంత ప్రయోగాత్మకంగా తీస్తూ వస్తున్న ఈయన ఆ పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు మళ్ళీ తనదైన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ లోకి వచ్చారు.
 
'ఎటాక్' అనే వర్కింగ్ టైటిల్తో,  హై ఇంటేన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న తన తాజా సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం తెలుగు చలనచిత్ర చరిత్రలో మునుపెన్నడూ, ఎవ్వరూ షూట్ చేయని విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ పురానాపూల్ బ్రిడ్జ్ పై దాదాపు 1000 మంది పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ రెయిన్ ఎఫెక్ట్ తో తీస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ శుక్రవారం ప్రారంభమైంది. 
 
హైదరాబాద్ ధూల్ పెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమలోని కొంతమంది నటీనటుల లుక్స్ ని విడుదల చేశారు వర్మ. మంచు మనోజ్ , సురభి హీరోహీరోయిన్లుగా ప్రకాష్ రాజ్ , జగపతి బాబు కీలకపత్రాల్లో నటిస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మాణం లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ నెలలో విడుదలవుతున్నట్టు టాలీవుడ్ టాక్.