శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:48 IST)

పవన్ కొడుకు అకీరా, కూతురు ఆద్యలతో మట్టి ప్రమిదలు చేయిస్తున్న రేణూ...

రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యలు దీపావళి పండుగకు మట్టి ప్రమిదలు చేస్తూ కనబడ్డారు. ఎక్కడా అంటారా... రేణూ దేశాయ్ ఫేస్ బుక్ పేజీలో. పవన్ కళ్యాణ్ పిల్లలు విభిన్నంగా పెరుగుతున్నారనే విషయాన్ని ఫోటో రూపంలో రేణుదేశాయ్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూస్తే అర్థమవుతుంది. 
 
దీపావళి అంటే పిల్లలు బాణాసంచాను కాలుస్తూ కేరింతలు కొడుతుంటారు. కానీ రేణూ దేశాయ్ మాత్రం తన పిల్లలు అకీరా నందర్, ఆద్యలను మట్టి ప్రమిదలు చేయిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను రేణూ తన ఫేస్ బుక్ లో పెట్టింది.