శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (10:12 IST)

శంకర్ సినిమాల కోసం బ్లాక్‌లో టిక్కెట్లు కొన్నా : మహేష్

ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలను తొలి రోజే చూసేందుకు బ్లాక్‌లో టిక్కెట్లు కొనుక్కుని చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయని హీరో మహేష్ బాబు చెప్పాడు. శనివారం రాత్రి ‘ఆగడు’ ఆడియో వేడుక హైదరాబాద్ జరిగింది. ఇందులో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ... ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలను తాను మద్రాసులో ఫస్ట్ రోజే చూసేవాణ్ణని, బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కొని శంకర్ సినిమాలకు వెళ్లానని చెప్పారు. 
 
ఈ వేడుకకు వచ్చిన శంకర్‌కు మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తమన్ ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు. ‘దూకుడు’ సినిమా తన కెరీర్‌లో ఓ మైలురాయి అని, ఇప్పుడు అదే దర్శకుడు శ్రీను వైట్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ‘ఆగడు’ సినిమా సెప్టెంబరు 19వ తేదీన విడుదల అవుతుందని మహేష్ బాబు ప్రకటించారు.