బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (15:55 IST)

దేవదాస్ కనకాల భూమి కబ్జా: హయత్ నగర పోలీసులకు ఫిర్యాదు!

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాలకు చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు. దాంతో దేవదాస్, రాజీవ్‌లు బుధవారం ఉదయం హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో దేవదాస్ కనకాలకు చెందిన స్థలంలో గత ఆర్థరాత్రి కొందరు దుండగులు ప్రవేశించి, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 
 
స్థానికులందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న దేవదాస్ తదితరులు దుండగులను వెళ్లిపొమ్మని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో, పోలీసులను ఆశ్రయించారు.