గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (10:47 IST)

'మిస్ ఇండియా వరల్డ్'గా ఢిల్లీ భామ అదితి ఆర్య... న్యాయనిర్ణేతగా జాన్ అబ్రహాం..!

'ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ - 2015' పోటీలలో ఢిల్లీ భామ అదితి ఆర్య విజేతగా నిలిచింది. యష్‌రాజ్ స్టూడియోలో కన్నుల పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో అదితి ఆర్య 'మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకుంది.
 
అఫ్రీన్ రేచల్ వజ్ తొలిరన్నరప్‌గా.. వర్తికా సింగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. శనివారం సాయంత్రం ఇక్కడ ఈ పోటీ జరిగింది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేత అదితి ఆర్య ఇప్పుడిక ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు.
 
తొలి, ద్వితీయ రన్నరప్‌లుగా ఎంపికయిన వారు వివిధ అందాల పోటీల్లో పాల్గొంటారు. కాగా ఈ పోటీలకు బాలీవుడ్‌కు చెందిన జాన్ అబ్రహాం, మనీషా కొయిరాలా, సోనునిగమ్, అనిల్ కపూర్, ఫిరోజ్ నది యాద్ వాలా, శిలపాషెట్టి, సోనాలీ బింద్రే, చిత్రాంగద సింగ్, డిజైనర్లు అబూ జానీ, సందీప్ ఖోస్లాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.