నాగ్ మాటలకు అర్థాలే వేరులే... అప్పుడు దిల్ రాజు, ఇప్పుడు దిల్ హీరో, అఖిల్ సినిమా
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే.. అనేది పెద్దల మాట. సినిమాలో కూడా వెంకటేష్ చేసి చూపించాడు. అక్కినేని నాగార్జున అంటే.. పెద్ద బిజినెస్మేన్ అనేది వుంది. సినిమావాళ్ళు ఏమి మాట్లాడినా.. రివర్స్లో వుంటుందని నాగార్జున వల్ల తెలుస్తోందని టాక్ విన్పిస్తోంది.
'మనం' చిత్రంకు ముందు నుంచి... అఖిల్ ఎంట్రీ గురించి అడిగినప్పుడల్లా ఇప్పుడే కాదు. ఇంకా టైమ్ వుంది. రెండేళ్ళ పడుతుందని చెప్పిన నాగ్.. సినిమా విడుదలకు ముందు ట్విస్ట్ ఇచ్చాడు. అఖిల్ వున్నాడనీ. ఆ తర్వాత అఖిల్ను హీరోగా మా బేనర్లో నేను చేస్తానని ప్రకటించాడు కూడా. నా బేనర్లో నాగచైతన్యను పరిచయం చేయకుండా తప్పు చేశానని బాధను కూడా వ్యక్తం చేశాడు. ఆ తప్పు మళ్ళీ అఖిల్ విషయంలో చేయకూడదని గట్టిగా చెప్పాడు. అప్పట్లో నాగచైతన్యను దిల్ రాజు చేత లాంఛ్ చేయించాడు.
ఇప్పుడు కట్ చేస్తే.... అఖిల్ను కూడా.. దిల్ హీరో నితిన్ ఫాదర్ చేత లాంఛ్ చేయించాడు. ఇది ఫ్యాన్స్కు ఆశ్చర్యం కల్గించినా.. ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఏదో లెక్కలు వున్నాయి నాగార్జున వద్ద అంటున్నారు. అందుకే సొంత బేనర్ కాకుండా బయట బేనర్లో చేశాడని విన్పిస్తోంది. కాగా నితిన్, అఖిల్ స్నేహితులట. పైగా నితిన్, సుధాకర్ రెడ్డి హ్యాండ్లు మంచి రైజింగ్లో వున్నాయి. అదికూడా తన కొడుకుకి ప్లస్ అవుతుందని భావించి వుంటాడని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అందుకే.. నాగార్జున మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు.