శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ganesh
Last Updated : గురువారం, 19 జూన్ 2014 (16:09 IST)

ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన అక్కినేని అఖిల్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ఇపుడు తన అభిమానులకు సారీ చెబుతున్నాడు. అఖిల్ ఏంతప్పు చేశాడు అని అనుకుంటున్నారా.. 20 రోజులు ఆగండి నేను హీరోగా నటించబోయే సినిమా విషయాలు చెబుతునానని ఇటీవల అఖిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, అఖిల్ అభిమానులు ఎంతో సంతోషపడ్డారు.

కానీ ఇపుడు 20 కాదు నెలరోజులు దాటిపోయింది. అయినా అఖిల్ నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో అతని అభిమానులు కొంత నిరాశకు గురయ్యారట. ఇటీవలె నాగార్జున మనం దర్శకుడు విక్రం చెప్పిన కథ విన్నారు. త్వరలో విక్రంతో అఖిల్ సినిమా ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అఖిల్ సినిమాలో అలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది అనే గాసిప్స్ వచ్చాయి.

అలా అఖిల్ సినిమా విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు అంతకంతకూ ఉత్కంఠకు గురవుతున్నారు. అఖిల్ కొత్త సినిమా కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్తలకు చెక్ పెట్టేందుకు అఖిల్ రంగంలోకి దిగాడు.

''అందరూ నేను ఏం చేబుతానోనని ఎదురుచూస్తున్నారని తెలుసు. నాక్కూడా ఇలా ఆల‌స్యం చేయ‌డం న‌చ్చడం లేదు. కానీ సినిమాకి ముందు చేయాల్సిన క‌స‌ర‌త్తులు చాలా ఉన్నాయి క‌దా. వాటి ప‌నుల్లో ఉన్నా. అందుకే ఈ ఆల‌స్యం. దానికి నేను సారీ చెబుతున్నా" అంటూ అఖిల్ తాజాగా ట్వీట్ చేశాడు. దీంతో త్వరలో అఖిల్ ఓ శుభవార్తతో మన ముందుకు వస్తాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు.