ప్రభాస్ సరసన అలియా భట్: బాహుబలి తర్వాత మిర్చి హీరోతో..?
అందానికీ, చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్గా మారిన అలియాభట్.. బాలీవుడ్తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రభాస్ తాజా చిత్రంలో కథానాయిక కోసం అలియాభట్ను సంప్రదించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే.
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందనుంది. టాలీవుడ్ సినిమాలు చేయడానికి ఆలియాభట్ ఆసక్తిని చూపుతుందని తెలిసి ఆమెని సంప్రదించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.