'అల్లుడు శీను' కోసం వినాయక్ బయటకు రాక తప్పలేదు
ఈమధ్య ప్రముఖ దర్శకులు ఎవరూ బయటకు వచ్చి సినిమా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉండటంలేదు. అందులో వినాయక్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్ ఇలాంటివారు చేసేవి పెద్ద హీరోలతో... రిలీజ్ గురించి నిర్మాతే చెప్పుకుంటాడు. బయటకు వస్తే ఏవేవో అడుగుతారనో ఏమోకానీ.. ఎప్పుడూ బయటకు రావడంలేదు. ఆమధ్య వినాయక్... బద్రినాథ్ సినిమా చేసేటప్పుడు మీడియాను కలవాలంటే.. ఆ... ఎందుకు? అన్నట్లుగా ప్రవర్తించేవాడు. కానీ ఈసారి రాక తప్పలేదు. ఎందుకంటే.. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం పైగా సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు కాబట్టి రాక తప్పలేదు.
ఈ సినిమాకు ఇప్పటికే చాలా ఖర్చు చేశారు. ఇందులో సమంత హీరోయిన్.. చిత్రానికి 'అల్లుడు శీను' అని టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని శనివారంనాడు హైదరాబాద్ శివారల్లోని అల్యూమినియం ఫ్యాక్టరలో యాక్షన్ సన్నివేశాలు తీస్తుండగా వినాయక్ వెల్లడించారు.
టైటిల్ అనేది బ్రహ్మానందం, శ్రీనివాస్కు మధ్య జరిగే సంభాషణల్లోంచి పుట్టుకువచ్చింది. ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. ఈ నెల 29న ఆడియోను వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.