గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (17:01 IST)

ఆర్య, అనుష్క 'సైజ్‌ జీరో'... గెస్ట్‌గా శ్రుతి హాసన్

అనుష్క, ఆర్య ప్రధానపాత్రల్లో ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'సైజ్‌ జీరో'. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా హైదరాబాద్‌లోని పివిపి సంస్థ ఆఫీస్‌లో ప్రారంభమైంది. 

 
ముహర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా పివిపి సతీమణి ఝాన్సీ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కణిక థిల్లాన్‌ కొవెలమూడి క్లాప్‌ కొట్టారు. డిఫరెంట్‌ కథాంశాలతో సినిమాలను నిర్మించి  తెలుగు ప్రేక్షకుల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న పివిపి నిర్మాణ సంస్థ రొమాంటిక్‌ కామెడి కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 
 
ఈ చిత్రంలో అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గ్లామరస్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ ఇందులో గెస్ట్‌ అప్పియరెన్స్‌ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. 
 
అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక ధిల్లాన్‌ కొవెలమూడి, ఎగ్జిక్టూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్‌ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్‌ కొవెలమూడి.