హాలీవుడ్ హీరో అర్నాల్డ్ , రజనీకాంత్ ముఖ్యఅతిథులుగా 'ఐ' ఆడియో ఫంక్షన్
చియాన్ విక్రమ్ హీరోగా ఆస్కార్ ఫిలింస్ ప్రై. లి. బ్యానర్పై గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ఐ'. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాను కూడా నిర్మించనివిధంగా 180 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో 'ఐ' నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్, మెగా సూపర్గుడ్ ఫిలింస్ కలిసి 'మనోహరుడు'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న 'ఐ' చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగబోతోంది. ఈ ఆడియో ఫంక్షన్కి హాలీవుడ్ సూపర్హీరో అర్నాల్డ్ ష్వావెర్జెనెగర్, సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో 20,000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.