శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 27 మే 2015 (16:23 IST)

మే 31న 'బాహుబలి' ఆడియో విడుదల.. చిరు, వెంకీ, నాగ్, రజనీ, అల్లు హాజరు..

రాజమౌళి దర్శకత్వం వస్తున్న 'బాహుబలి' సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్‌ని మే 31న చెయ్యనున్నారు. తమిళం, తెలుగు ఆడియో రైట్స్‌ని లహరి మ్యూజిక్ వారు రూ.3 కోట్లకి సొంతం చేసుకున్నారు.
 
ఇక ఆడియో విడుదలకు చత్రపతి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కారణంగా ఫుల్ క్రేజ్ పెరుగుతుంది. ఇక ‘బాహుబలి ‘ ఆడియోకి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, అల్లు అర్జున్, రజినీకాంత్ ఇంకా పలువురు ప్రముఖులు హాజారుకానున్నట్లు సమాచారం. 
 
ఇక ఈ ఆడియో లాంచ్‌కి హోం-మేకర్స్, అమ్మాయిలు, యూత్ అంతా కలిసి ఈ ఈవెంట్‌కి అటెండ్ అవ్వబోతున్నారు. ఇక బాహుబలి ఆడియో పాసేస్‌కి ఫుల్ క్రేజ్ పెరిగి పోయింది. హీరో ప్రభాస్, అనుష్క, రానా లీడ్ రోల్స్‌లో వస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్‌ని అందించారు.