గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:38 IST)

బాపు అంత్యక్రియలు పూర్తి... చెన్నై బీసెంట్ నగర్ లో...

ప్రముఖ దర్శకుడు,  చిత్రకారుడు బాపు అంత్యక్రియలు మంగళవారంనాడు హిందూ సాంప్రదాయాల ప్రకారం చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. అంతిమ యాత్రలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితోపాటు ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బోనీ కపూర్, అనిల్ కపూర్, రావికొండలరావు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
 
బాపు అంతిమయాత్రలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపు అంత్యక్రియల నేపథ్యంలో చెన్నై బీసంట్ నగర్ ప్రాంతం అభిమానులతో నిండిపోయింది. బాపుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీ స్థాయిలో సినీ తారలు, ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు.