సెప్టెంబర్ 5న వస్తున్న 'బూచమ్మ బూచోడు'..!!
శివాజి-కైనాజ్ మోటీవాలా ('రాగిణి ఎం.ఎం.ఎస్' ఫేం) జంటగా స్నేహ మీడియా- హెజెన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బూచమ్మ బూచోడు'. హిలేరియస్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రేవన్ యాదూ దర్శకుడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
తమ హాలీడే ట్రిప్ను సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన యువజంటకు ఎదురైన సంఘటనల సమాహారమే 'బూచమ్మ బూచోడు' చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి ఆదరణతో పాటు.. శేఖర్చంద్ర అందించిన ఆడియోకు విశేషమైన స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా తమ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉందని చిత్ర నిర్మాతలు రమేష్ అన్నంరెడ్డి-ప్రసాద్రెడ్డి తెలిపారు.