త్రిష-వరుణ్కు ఇప్పుడిప్పుడే ఎంగేజ్మెంట్: అప్పుడే బ్రేకప్ రూమర్సా!?
అందాల తార త్రిషకు ఇప్పుడిప్పుడే వరుణ్ మణియన్తో ఎంగేజ్మెంట్ అయ్యింది. బిజినెస్ మేన్ అయిన వరుణ్ మణియన్తో నిశ్చితార్థం అయినప్పటికీ ఇంకా వివాహ తేదీ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ టౌన్లో షాకింగ్ రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.
త్రిష-వరుణ్ మణియన్ల మధ్య బ్రేకప్ అయ్యిందని.. అందుకే వివాహ తేదీని ఇంకా అనౌన్స్ చేయలేదని తమిళ మీడియా కోడైకూస్తోంది. ఇందుకు తగిన కారణాలు కూడా లేకపోలేదు. ఈ మధ్య వరుణ్ మణియన్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన త్రిష ప్రస్తుతం ఎక్కడికెళ్లినా ఒంటరిగా వెళ్తోందని సమాచారం.
వరుణ్ మణియన్తో త్రిష కటీఫ్ చేసుకోవాలనుకుంటోందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. వరుణ్ మణియన్ ప్రొడక్షన్స్ కంపెనీలో జై సరసన త్రిష ఏప్రిల్ నుంచి నటించాల్సి ఉండగా.. మణియన్ ప్రొడక్షన్స్ నిర్మించే సినిమా నుంచి త్రిష తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
త్రిష ఈ విధంగా చేయడం వరుణ్ ఫ్యామిలీకి షాక్కు గురిచేసిందని సమాచారం. అయితే ప్రొఫెషనల్ పరంగా త్రిష వరుణ్ సినిమా నుంచి తప్పుకుందని సన్నిహితులు చెబుతున్నా.. వరుణ్ మణియన్తో బ్రేకప్ కావడమే ఇందుకు కారణమని కోలీవుడ్ జనం అనుకుంటున్నారట. మరి త్రిష-మణియన్ ఏమంటారో వేచిచూడాల్సిందే.