శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (14:49 IST)

చక్రి ఫ్యామిలీ ఆస్తుల గొడవలు.. కేటీఆర్ వద్ద పంచాయతీ!

ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగీత దర్శకుడు చక్రి కుటుంబ ఆస్తుల పంచాయతీ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఇదే అంశంపై చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ్, సోదరి కృష్ణప్రియలు మంగళవారం ఆయనను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. 
 
చక్రి మరణానంతరం ఆయన భార్య శ్రావణికి, ఆయన తల్లి, సోదరుడికి మధ్య ఆస్తుల గొడవ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ క్రమంలో, ఉభయులూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. 
 
విష ప్రయోగంతో చక్రిని చంపేశారని ఒకరిపై మరొకరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్‌ను చక్రి తల్లి, సోదరుడు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మా సోదరుడు చక్రి మరణంపై విచారణ జరిపించాల్సిందిగా కేటీఆర్‌ను కోరామని ఆయనను కలిసిన అనంతరం కృష్ణప్రియ వెల్లడించారు.