గోవా బీచ్లో సెక్సీ చార్మి
గోవా బీచ్కు చార్మి తరచూ వెళుతుంటుంది. అయితే ఈసారి షూటింగ్ పనిమీద వెళ్ళింది. పైగా పూరీ జగన్నాథ్తో వుందట. విషయం ఏమంటే... ఆమె నటిస్తున్న చిత్రం 'జ్యోతిలక్ష్మి'. లేడీ ఓరియెంటెడ్ మూవీగా దర్శకుడు తీస్తున్నారు. ఇటీవలే మహిళా దినోత్సవం రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర టీం ఫస్ట్ షెడ్యూల్ని హైదరాబాద్ లో చేశారు. మలి షెడ్యూల్ను గోవాకు షిప్ట్ చేశారు. అక్కడ కొన్ని సన్నివేశాలను పాటలను చిత్రిస్తున్నారు.
గతకాలపు జ్యోతిలక్ష్మికు ఈ జ్యోతిలక్ష్మికి తేడా వుందంటున్న పూరీ ఈ సినిమాలో చార్మీ అల్ట్రా మోడ్రన్గా కనిపించడమే కాకుండా హాట్ హాట్గా కూడా చూపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఛార్మీ వెయిట్ కూడా తగ్గి మరింత స్లిమ్ అయ్యింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ధ నవలా ఆధారంగా పూరి ఈ సినిమా తీస్తున్నాడు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.