గుణశేఖర్పై హీరో సుమన్ కేసు.. చెక్కు బౌన్స్ అయిందనీ...
'రుద్రమదేవి' దర్శకుడు గుణశేఖర్పై కేసు వేయడానికి చిత్ర యూనిట్ ధైర్యం చేయలేకపోయినా... నటుడు సుమన్ మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చారు. గతంలో అనుష్క పాత్రకు ఒరిజినల్ బంగారు నగలు చెన్నై నుంచి తెచ్చినట్లు ఆ తర్వాత అవి మాయమైనట్లు అందుకు కొందరిపై అనుమానంతో గుణశేఖర్ పోలీసులకు చెప్పాడు.
అయితే చిత్ర యూనిట్లో కొంతమందిని పోలీసులు అనుమానితులుగా రోజూ పోలీసుస్టేషన్కు వచ్చి సంతకం పెట్టాలని నిబంధన పెట్టారు. ఇది బయట చెప్పుకోలేక వారంతా లోలోన మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో... గుణశేఖర్పై నటుడు సుమన్ కేసు పెట్టాడు.
ఇందులో తాను నటించిన పాత్రకు రెమ్యునరేషన్లో భాగా ఐదు లక్షలు ఇవ్వాల్సి వుంది. దాన్ని చెక్ రూపంలో ఇచ్చాడు. అది బౌన్స్ అయింది. దీనిగురించి అకౌట్స్ విభాగం పట్టించుకోలేదు. పైగా గుణశేఖర్ దృష్టికి తెచ్చినా సరైన సమాధానం ఇవ్వలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.