'ఆటో జానీ'లో చిరు సరసకు చేరేదెవరు..? క్యూలో నయన.. సోనాక్షి...!
చిర కాలంగా మెగాస్టార్ చిరంజీవిత అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆయన 150 చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. సినిమా టైటిల్ను కూడా 'ఆటో జానీ'గా నిర్ణయించారు. తర్జన బర్జనల అనంతరం పూరి జగన్నాథ్ అయితేనే బెటరని చిరంజీవి ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలకు థియేటర్లు డెకరేషన్ చేసిన పూరి జగన్నాథ్. ఆయన్నే దర్శకత్వం వహించే అవకాశం దక్కడంపై ఆనందంగా ఉన్నారు.
కాగా ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్న సంగతి తెలిసింతే. అయితే ప్రస్తుతం సాగుతున్న చర్చ ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్గా నటించేదెవరు అనేదే. పూరి తొలి ఛాన్స్ను నయనతారకు ఇస్తున్నారట. ఒక వేళ ఆమెకు డేట్స్ కుదరకపోతే, హిందీ బ్యూటీ సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అంతేకాకుండా ఈ చిత్రంలో అంజలిని సెంకడ్ హీరోయిన్గాను, చార్మిని ఐటం గర్ల్గా తీసుకునే అవకాశం ఉందని లేటస్ట్ టాక్. అయితే ఈ విషయాలు అన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి చిరు సరసన నటించే లక్ ఏ బ్యూటీకి దక్కుతుందో వేచి చూడాలి మరి.