చిరంజీవిని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మెగా అభిమానులు!
రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో విడుదల ఫంక్షన్ శిల్పకళావేదికలో మెగా అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతున్నప్పుడు పవన్ గురించి అభిమానులు నినాదాలు చేసి ఆయనను కొంత అసహనానికి గురిచేశారు.
ఆయన ప్రసంగానికి పదే పదే అడ్డుతగలడంతో చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పలేదు. మీ.. మా పవన్ కళ్యాణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా 15౦ రోజుల ఉత్సవానికి వస్తే అభ్యంతరమా? అని చిరంజీవి అభిమానులను ఒకింత అసహనంతో వ్యాఖ్యానించాడు.
అంతేకాకుండా, ఆడియో సీడీ ఆవిష్కరణ అనంతరం 'గోవిందుడు అందరి వాడేలే' చిత్ర యూనిట్ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫ్యాన్స్ చిరంజీవి మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో, రామ్ చరణ్, కృష్ణవంశీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్లు తమ చేతుల్లోని మైకులను మెగాస్టార్కు అందించేందుకు ప్రయత్నించారు.