సెప్టెంబర్ 14న 'కరెంట్ తీగ' ఆడియో విడుదల..!!
డా||ఎం.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మనోజ్కుమార్ కథానాయకుడిగా మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'కరెంట్ తీగ'. మంచు మనోజ్కుమార్ సరసన రకుల్ ప్రీతిసింగ్, సన్నీలియోన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వర్రెడ్డి దర్శకుడు. జగపతిబాబు ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
అచ్చు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను ఈ నెల 14న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో పరిశ్రమ పెద్దల సమక్షంలో అత్యంత ఘనంగా.. హైద్రాబాద్, పార్క్ హయత్లో విడుదల కానుంది. మంచు మనోజ్ పాడిన 'దేవదాస్ బ్రేకప్' అనే పాటతోపాటు సన్నీలియోన్ నర్తించిన ప్రత్యేక గీతం 'కరెంట్ తీగ' చిత్రానికి హైలైట్గా నిలవనున్నాయి!