గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 ఆగస్టు 2014 (15:49 IST)

ధనుష్-అక్షర మూవీకి అడిషనల్ క్రేజ్.. 9 మంది..?

ధనుష్ బాలీవుడ్ సినిమాకు అడిషనల్ క్రేజ్ దక్కనుంది. బక్కగా ఉన్నా చూడడానికి పర్వాలేదనిపించుకున్నా.. రంఝానాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. రంఝానా హిట్ కావడంతో బాలీవుడ్‌లో ధనుష్ రెండో సినిమా చేస్తున్నాడు. 
 
రంఝానాలో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్‌తో చేశాడు. ప్రస్తుతం ధనుష్ నటించే రెండో బాలీవుడ్ మూవీ షామితాబ్‌లో కమల్ రెండో కుమార్తె అక్షరతో ధనుష్ జోడీ కట్టనున్నాడు. 3 సినిమా ద్వారా కమల్ పెద్ద కూతురు గబ్బర్ సింగ్ హీరోయిన్‌ శృతిహాసన్‌తో జతకట్టిన బక్క పలచని ధనుష్‌కు దశ తిరిగిందంటున్నారు. 
 
అందుకే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ధనుష్ హీరోగా ఆర్ బాల్కీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేగాకుండా ఈ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించేందుకు 9 సెలబ్రిటీలు కూడా ఓకే చెప్పేశారట. 9 మంది సెలబ్రిటీలలో కరణ్ జోహార్, మహేష్ భట్, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, అనురాగ్ బసు, జావేద్ అక్తర్‌లు కూడా ఉన్నారు. 
 
ఇకపోతే.. ధనుష్-బాల్కీ కాంబినేషన్‌లో వస్తోన్న షామితాబ్ మూవీకి తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చడం విశేషం. ఈ సినిమా 2015 ఫిబ్రవరి ఆరోతేదీన రిలీజ్ కానుంది.