గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (16:11 IST)

డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం లేదంటున్నారు... మరి పనసా రవి...

సినిమా రంగానికి చెందిన సుశాంత్ రెడ్డి అనే ఓ వ్యక్తి జూబ్లిహిల్స్‌లో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న నైజీరియా ముఠాతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఐతే ఈయన ఓ చిన్న సినిమాను నిర్మించినవాడు కావడంతోనూ, ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడేసరికి మీడియాలో టాలీవుడ్‌లో డ్రగ్స్ పరవళ్లు తొక్కుతున్నాయంటూ కథనాలు వచ్చేశాయి. ఆ సంగతి అలా ఉంచితే డ్రగ్స్‌ మాఫియాతో టాలీవుడ్‌ లింకులు ఉన్నట్లు మరోసారి బయటపడ్డాయి. 
 
మంగళవారం అరెస్ట్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా ముఠాకు సీసీఎల్‌ పీఆర్వో రవి పనసాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో రవి పనసాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐతే పనసా రవి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడనీ, ఓ మంత్రి చేత చెప్పించి తప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.