శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (13:37 IST)

మెగాస్టార్ బర్త్ డే: నేపాల్‌లో చిరు ఫ్యామిలీ.. దుమ్మురేపిన ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని ఫ్యాన్స్ దుమ్మురేపారు. అన్నయ్య పుట్టిన రోజును సందర్భంగా మెగాస్టార్ చిరంజవి కుటుంబ సభ్యులతో నేపాల్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి పశుపతి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు చిరంజీవి అభిమానులు ఇక్కడ దుమ్ము రేపారు. 
 
మెగా స్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్బంగా వివిధ ప్రాంతాల్లోని 25 వేల మందికిపైగా రక్తదానం చేసారు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అల్లు అరవింద్ ప్రారంభించారు. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ రక్తదాన శిబిరాలలో 2,365 మందికిపైగా అభిమానులు రక్తదానం చేసారు. 
 
చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్ శ్రీదాసాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష తమళపాకులతో చిరంజీవి పేరు మీద పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. అన్నయ్య సినిమా కోసం ఎదురుచూస్తున్నామని, రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 150వ సినిమా త్వరలో సెట్స్ పైకి రావాలని ఆశించారు.